16, జూన్ 2018, శనివారం

రుద్రులు

 అన్నమయ్య  “ రుద్రుల “ గూర్చి  ఈ క్రింది సంకీర్తనలో చెప్పారు.. రుద్రులు “ అగ్ని నిలయాలు.
     “ ( ఫైర్ హౌసెస్ ). కనుక ,   రుద్రుని ఒక సజీవ స్థానంగా పరిగణించవచ్చుఁ. రుద్ర రూపం  “ అగ్ని “
అన్ని రుద్రులు పరబ్రహ్మ సృష్టియే. “పరబ్రహ్మ “ లోక కేంద్ర స్థానం ,  మహా శక్తి స్తానం.

           “  కైలాసమున కలడొక  రుద్రుడు ,  తాలిమి ఏకాదశ  రుద్రులు
              కాలరుద్రుడు కడపట నదివో,  రుద్రుల సంతాయనే  జగము. “ (333 సంకీర్తన, 3వ సంపుటం ).

“ కైలాసము “ ఒక లోకం. దాని  అధిపతి శివుడు.  అదీగాక 11 రుద్రులు, లోకకేంద్రస్థానపరిమితిలో  ఉంటాయి, లేక వుంటారు.  ప్రతి ఒక్క రుద్రుడికి ఒక ప్రత్యేకమైన పేరు వున్నది.
కపిల, పింగళ, భీమా, విరూపాక్ష, విలోహిత, అజేష, శాస్ట, శాసన ...... మొదలుగా , పేర్లు గల రుద్రులున్నారు.
చివరి రుద్రుడు “ కాల. “ కాలుడు “. మొత్తానికి, లోకమంతా “రుద్రుల సంత “ అన్నారు అన్నమయ్య.

మరి, రుద్రుల పని ఏమిటి.?
లోకములు కానీ, మరేదైనా అంతరిక్ష అస్థిత్వాలు  గానీ,  బలహీనమై, స్థిరత్వం కోల్పోయినప్పుడు ,  అగ్నిలో నశింపచేయుటే.      ఈ  “ అగ్ని నిలయములు “ దేనినైనా భస్మం చేయగల శక్తీ చైతన్యాలు.
బ్రహ్మలు “సృష్టి” కారకాలైతే,  రుద్రులు   “వినాశకారకాలు. “

బ్రహ్మలైనా, రుద్రులైనా పుట్టించబడేది, ఒకే ఒక పరబ్రహ్మ నుండే.  అందుకే,  అన్నమయ్య , ఈ సంకీర్తన పల్లవిలో ఇలా అన్నారు. .........

                “    ఒక్కడెవ్వడో  ఉర్వికి   దైవము, ఎక్కువనాతని  ఎరుగవో  మనసా “

          అన్నమయ్యమాట


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి