అన్నమయ్య ,” పరబ్రహ్మము ” అంటే , లోకాలన్నీ వ్యాపించిఉన్న “విశ్వకాంతియే ” అని, అను పరమానులోనున్న పరంజ్యోతి యని, చాలా సంకీర్తనలలో చెప్పారు. ఆపరబ్రహ్మము , ఒక “ సంజీవి “లాంటిది.
ఎంత మహిమాన్వితమైనదో , క్రింది సంకీర్తనలో చెప్పాడు.
“ సకల జీవులకెల్ల “సంజీవి “ ఈ మందు. “
ప్రజ్వల తేజస్సుతో , సకల జీవరాశులలో ” ప్రాణ శక్తి “ ని ప్రసాదించే “పరబ్రహ్మమే ,యీ “ సంజీవి” లాంటి “మందు”, హాఁ! హా ! యీ “పరబ్రహ్మమే” సంజీవి అని, అన్నమయ్య చెప్తున్నాడు.
“ సంజీవి “ అంటే , “ప్రాణమిచ్ఛేది ” యని అర్ధము. అంటే , “ప్ర్రాణ శక్తి “ యగు “ఓజస్సు. “
ఓజస్సు= “ పుష్ఠి , తుష్ఠి కలిగించే ప్రాణశక్తి “. ఆ “సంజీవి ” యగు విష్ణువే, చరాచరములకు, సకల జీవాజీవములకు ఆధారము.
“ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః “ అని “విష్ణుసహస్రనామం”లో, “విష్ణు రూపము “ చక్కగా వర్ణించబడివుంది. కనుక, విష్ణువు = పరబ్రహ్మం = పరమాత్మ = పరంజ్యోతి
“ సకల జీవులకెల్లఁ “ సంజీవి “ యీ మందు “
“మూడు లోకములొక్కటఁ ముంచి పెరిగినది
పోడిమి “ నల్లని కాంతి “ పొదలినది
వేడుక కొమ్ములు నాల్గు పెనచ్చి, చేయి వారినది “.
అలాంటి విష్ణువు, ఒకప్పుడు, కొన్ని కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం, మూడు లోకాలను ఒక్కసారిగా నాశనముచేసి, ఒకే ఒక్క చోటులో, మూడు లోకాలను ముంచివేయడం జరిగింది. ఈ సందర్భంలో, మూడులోకాలలోని పదార్ధము, శక్తి రూపంలోకి పరివర్తనమైంది. ఎంత పదార్ధమో, వూహకు అందదు. ఎంత శక్తో , చెప్పడానికి అలవికాదు. ఈ ఘటన లో చెప్పడానికి వీలుపడనంత “ఆకర్షణ శక్తి “ (గ్రావిటీ ) ఆ
“పరబ్రహ్మ “ స్థానంలో సృజిస్తుంది. అందుండి, మళ్ళీ మళ్ళీ క్రొత్త క్రొత్త పదార్థాలు సృజించబడతాయి..
అవి, మళ్ళీ క్రొత్త మూడు లోకాలు గూడా కావచ్చు.
“ఈ ప్రళయ ఘటన , “ పదార్థము శక్తి గ పరివర్తన“ ఘటన. “
“ మాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ “. అని , సైన్స్ నిర్వచిస్తుంది.
ఆశక్తి రూపం కోట్ల సూర్యకోట్ల ప్రకాశముగా, ప్రకటమైంది. ఎంత ప్రకాశమంటే, అది చివరికి కంటికానని ప్రకాశము అవడం వల్ల , మొత్తం నల్లగ కనిపించుతుంది.అన్నమయ్య, నల్లని పొదలాగా కనిపించే విష్ణుకాంతిని, “నల్లనికాంతి “ అని వర్ణించాడు. ఈ “ నల్లని కాంతి ” పొదలోనుండి , నాలుగు కొమ్ములు, నాలుగు చేతులలాగా , పెకలించుకోని , బయటకు వచ్చ్చాయట. అందుకే, విష్ణు రూపకల్పనలో నాలుగు చేతులు, చూపుతారు.
పడిగెలు వేయింటి పాము కాచుకొన్నది.
కడు వేద శాస్త్రాల గబ్బు వేసేది
అలరిన బ్రహ్మ రుద్రాదుల పుట్టించినది
వెలుగు తోడుత శ్రీ వెంకటాద్రి
ఆ “ నల్లని కాంతి “ లోనుండి , వేయిపడగలు పాము వంటి రూపం, ప్రకటమైంది.
పాము అంటే , విషమయం. ఆ “నల్లనికాంతి” పొదలో పుట్టినది, విష వాయువులు కక్కే వేయిపడగల పాము రూపం. ఈ “నల్లని కాంతి ” కుంభం నుండే, బ్రహ్మలు, రుద్రులు సృష్టింపబడ్డారు.
ఆనల్లకాన్తి నుండే వేద శాస్త్రాల లోని అప్పార జ్ఞానపు సువాసనలు వెదజల్లబడుచున్నది.
అంటే ,ఏ స్థాన మెందు ? ఎందులోన మూడులోకాలు ముగిసి , ముణిగి, ఇమిడి వున్నవో ,
ఎందుండి బ్రహ్మరుద్రాదులు పుట్టారో , ఎందుండి నాలుగు చేతులవంటి కొమ్ములు పుట్టాయో,
ఎందుండి విషవాయు పూరిత వేయి పడిగల పాము రూపం లేచి కాయుచున్నదో , ఆ, ఆ స్థానమే, తేజోమయ “పరబ్రహ్మ “. అదే సకల జీవులకు “ సంజీవి “.
అన్నమయ్య మాట.
ఎంత మహిమాన్వితమైనదో , క్రింది సంకీర్తనలో చెప్పాడు.
“ సకల జీవులకెల్ల “సంజీవి “ ఈ మందు. “
ప్రజ్వల తేజస్సుతో , సకల జీవరాశులలో ” ప్రాణ శక్తి “ ని ప్రసాదించే “పరబ్రహ్మమే ,యీ “ సంజీవి” లాంటి “మందు”, హాఁ! హా ! యీ “పరబ్రహ్మమే” సంజీవి అని, అన్నమయ్య చెప్తున్నాడు.
“ సంజీవి “ అంటే , “ప్రాణమిచ్ఛేది ” యని అర్ధము. అంటే , “ప్ర్రాణ శక్తి “ యగు “ఓజస్సు. “
ఓజస్సు= “ పుష్ఠి , తుష్ఠి కలిగించే ప్రాణశక్తి “. ఆ “సంజీవి ” యగు విష్ణువే, చరాచరములకు, సకల జీవాజీవములకు ఆధారము.
“ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః “ అని “విష్ణుసహస్రనామం”లో, “విష్ణు రూపము “ చక్కగా వర్ణించబడివుంది. కనుక, విష్ణువు = పరబ్రహ్మం = పరమాత్మ = పరంజ్యోతి
“ సకల జీవులకెల్లఁ “ సంజీవి “ యీ మందు “
“మూడు లోకములొక్కటఁ ముంచి పెరిగినది
పోడిమి “ నల్లని కాంతి “ పొదలినది
వేడుక కొమ్ములు నాల్గు పెనచ్చి, చేయి వారినది “.
అలాంటి విష్ణువు, ఒకప్పుడు, కొన్ని కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం, మూడు లోకాలను ఒక్కసారిగా నాశనముచేసి, ఒకే ఒక్క చోటులో, మూడు లోకాలను ముంచివేయడం జరిగింది. ఈ సందర్భంలో, మూడులోకాలలోని పదార్ధము, శక్తి రూపంలోకి పరివర్తనమైంది. ఎంత పదార్ధమో, వూహకు అందదు. ఎంత శక్తో , చెప్పడానికి అలవికాదు. ఈ ఘటన లో చెప్పడానికి వీలుపడనంత “ఆకర్షణ శక్తి “ (గ్రావిటీ ) ఆ
“పరబ్రహ్మ “ స్థానంలో సృజిస్తుంది. అందుండి, మళ్ళీ మళ్ళీ క్రొత్త క్రొత్త పదార్థాలు సృజించబడతాయి..
అవి, మళ్ళీ క్రొత్త మూడు లోకాలు గూడా కావచ్చు.
“ఈ ప్రళయ ఘటన , “ పదార్థము శక్తి గ పరివర్తన“ ఘటన. “
“ మాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ “. అని , సైన్స్ నిర్వచిస్తుంది.
ఆశక్తి రూపం కోట్ల సూర్యకోట్ల ప్రకాశముగా, ప్రకటమైంది. ఎంత ప్రకాశమంటే, అది చివరికి కంటికానని ప్రకాశము అవడం వల్ల , మొత్తం నల్లగ కనిపించుతుంది.అన్నమయ్య, నల్లని పొదలాగా కనిపించే విష్ణుకాంతిని, “నల్లనికాంతి “ అని వర్ణించాడు. ఈ “ నల్లని కాంతి ” పొదలోనుండి , నాలుగు కొమ్ములు, నాలుగు చేతులలాగా , పెకలించుకోని , బయటకు వచ్చ్చాయట. అందుకే, విష్ణు రూపకల్పనలో నాలుగు చేతులు, చూపుతారు.
పడిగెలు వేయింటి పాము కాచుకొన్నది.
కడు వేద శాస్త్రాల గబ్బు వేసేది
అలరిన బ్రహ్మ రుద్రాదుల పుట్టించినది
వెలుగు తోడుత శ్రీ వెంకటాద్రి
ఆ “ నల్లని కాంతి “ లోనుండి , వేయిపడగలు పాము వంటి రూపం, ప్రకటమైంది.
పాము అంటే , విషమయం. ఆ “నల్లనికాంతి” పొదలో పుట్టినది, విష వాయువులు కక్కే వేయిపడగల పాము రూపం. ఈ “నల్లని కాంతి ” కుంభం నుండే, బ్రహ్మలు, రుద్రులు సృష్టింపబడ్డారు.
ఆనల్లకాన్తి నుండే వేద శాస్త్రాల లోని అప్పార జ్ఞానపు సువాసనలు వెదజల్లబడుచున్నది.
అంటే ,ఏ స్థాన మెందు ? ఎందులోన మూడులోకాలు ముగిసి , ముణిగి, ఇమిడి వున్నవో ,
ఎందుండి బ్రహ్మరుద్రాదులు పుట్టారో , ఎందుండి నాలుగు చేతులవంటి కొమ్ములు పుట్టాయో,
ఎందుండి విషవాయు పూరిత వేయి పడిగల పాము రూపం లేచి కాయుచున్నదో , ఆ, ఆ స్థానమే, తేజోమయ “పరబ్రహ్మ “. అదే సకల జీవులకు “ సంజీవి “.
అన్నమయ్య మాట.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి