17, జులై 2020, శుక్రవారం

కొరోనా నిర్బంధమ్, అలనాటి నిశ్శబ్దం

     శ్రీ   శ్రీ  అన్నమాచార్యులవారు,ఎన్నో  గొప్ప అంతరిక్ష రహస్యాలు , తన సంకీర్తనలద్వారా మనకు తెలియచేసిన మహా విజ్ఞాని, మహా జ్ఞాని. ఈ నాటి “ లొక్డౌన్" కరోనా పరిస్థితి యే , ఆ 15 వ శతాబ్దిలో కూడా వచ్చ్చిందని ,  ఒక సంకీర్తనలో వెల్లడించారు.          

ఒకానొక  సందర్భాన, ఒకానొక పరిపరిస్థితి ఎలాగొచ్చిందంటే , ఎవ్వరు వెలియ  తిరుగకూడదు, ఇంటిలోనే ఉండవలసినది.  అట్టి పరిస్థిలో ఎవ్వరూ ఇంకొకరిని కలవరాదు. తిరుపతి పూర్తిగా  నిశ్శబ్దమై , నిశ్శబ్దంలో  నిలిచిన  సంధర్భమది . ఒక్కరూ ఇంటిలోనుండి  బయట తిరగడమే , సాహసించడం లాంటి స్థితి. ఒకవేళ  ఇంటినుండి బయటికి వచ్చ్చినాకూడా , ఒక్కరే , ఎలాంటి జోడు లేకుండా , దూరముగా తిరుగవలసిన నిర్బంధపూరిత వాతావరణ పరిస్థితి ఏర్పడినది.   


     “     ఓహోహో యనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి ”.        
     
 
   ఆకాశాన సూర్యచంద్రులు  ఎదురెదురెయిన  కాలము, అంటే “గ్రహణం “ సంభవించిన స్థితి , అది ఎటువం “ 
గ్రహణమంటే, ఎవ్వరూ దర్శించకూడనిది. ఆ  వాతావరణములో  వెలుపల తిరగడమంటే , పెద్ద “ సాహసముగా” భావించబడ్డ  విషమకాలము, విషకాలము.  విష పూరిత  వాతావరణము . 

        “ తిరుపణి  మణగెను , తిరుగరాదెవ్వరికీ, మరల నెలుగియ్యరో  మగపారి  

                                                                   “””””.                ఇరవాయ  సూర్యచంద్రులెదురు   పారి    “

            “పేనిపట్టి  వాకిళ్ళ  బీగముద్రలాయనిడి, కానిమ్మని  వాయించరో  గంట పారి”

 ఎంత  నిశ్శబ్దనిర్బంధమంటే , దేవాలయం  తలుపులు కూడా తాళ్లతోకట్టి బీగాలువేసి సీలు వేసారట.  దేవాలయము  బయటనుండి భక్తులు వారి, వారి  కోరికలు విన్న వించుకోవలసినదే . ఒక నిశ్శబ్ద నిర్బంధ పరిస్థితి,  శ్రీఅన్నమాచార్యులవారి  కాలంలోకూడా  వచ్చింది, అని పై సంకీర్తన చెప్తోంది ..     కాలం వేరే , కానీ,  కష్టమదే . పరిష్కారాలు : నిశ్శబ్దం, నిర్బంధం.       


“ హిస్టరీ రిపీట్స్ “, అంటే  చరిత్రలో జరిగినవి మళ్ళీ  మళ్ళీ జరుగుతూంటాయి , అని భావం. 
అన్నమయ్యనాటి  నిశ్శబ్దంలాటిదే , నేటి   కరోనా వైరస్ నిర్బంధం ......    

     


అన్నమయ్య మాట 

29, ఆగస్టు 2018, బుధవారం

దేవతలు

  లోకాలన్నీ  సృష్టించి, పాలించి , క్షయింపజేసే  బ్రహ్మ విష్ణు రుద్రాదులేగాక , వారికి సహాయముగా  దేవతలు కూడా  పరబ్రహ్మ (చే ) నుండి సృష్టించబడియున్నారు.
దేవతలు కొంత ప్రమాణంలో “పవర్స్ “   ఉన్న అస్తిత్వాలు. దేవతలను “ దివిజులు “ అనికూడా పిలుచుట పరిపాటే. దివి అంటే  అంతరిక్షము.  అంతరిక్షములోనున్నారు  కనుక  దివిజులు  అనిపిలవడమైంది.

దేవతల పని ,  బ్రహ్మ విష్ణు రుద్రుల పనిలో సహకరించడమే.  “వర్కింగ్ ఫోర్స్ అఫ్ ఆక్షన్ “.. “పవర్ బాడీస్ “
పని ముగిసిన పిమ్మట  మరలా ఎక్కడినుండి వచ్చ్చారో , ఆచోటిలోకే చేరుతారు, కలిసిపోతారు.  ఈ విషయం క్రింది సంకీర్తనలో అన్నమయ్య ఎంత చక్కగా చెప్పారో .........

                       “ పుట్టిరి దివిజులు  పురుషోత్తమునందు, అట్టే  అణగిరి యతనందు
                         ఇట్టే యీతని ఇందరితో సరివెట్టి  కొలుచుట పెనువెఱ్ఱి “   (55.8, 3వ సంపుటం )

ఇక్కడ పురుషోత్తముడు , పరబ్రహ్మ యే  గదా.    ఏయే విధముగా  బ్రహ్మలు, రుద్రులు , రోమకూపములు
పరబ్రహ్మ నుండి పుట్టినవో,  అదే మాదిరిగా దేవతలూ , పరబ్రహ్మ నుండి పుట్టుతారు, తిరిగి  పరబ్రహ్మలోనికే  కలుస్తారు. పరబ్రహ్మను మిగిలినవారితో  పోల్చి మాట్లాడకూడదు. అది పిచ్చ్చిపని , అంటారు అన్నమయ్య.  కొన్ని  వేవేల  సంఖ్యలో  వుంటారు  దేవతలు.
వేరే వేరే  దేవతలకు వేరే వేరే  శక్తులు, పదవులు  ఉంటాయి. రక రకాల వైభవాలను కల్పించే బలము గలవారు   దేవతలే.  దేవతలందరిలో  మహా శక్తి వంతమైన  దేవత  లక్ష్మీదేవి,  అద్భుతమైన వైభవాన్ని కలిగి, ఎప్పుడూ  విష్ణువుతోనే, విష్ణువులోనే ఉంటుంది. విష్ణు శక్తిఐ ఉంటుంది.  రకరకాల సంపదలు , ఎలాగంటే ఉదాహరణకు ........   ,   కీర్తి, ధనము , ప్రతిష్ట , ఆరోగ్యము, దార్ఢ్యము,  ధైర్యము, సంతానము,  మొదలుగా , అనేక సంపదలు లక్ష్మి దేవియే కలిగిస్తుంది.
ఈవిషయాన్ని   అన్నమయ్య  ఈక్రింది చరణంలో ఇలాగ చెప్తారు.

             జీవాంతరాత్ముడు శ్రీ వేంకటేశుడు , ఈవాళ శ్రీ లక్ష్మి యీతని దేవులు
           వేవేల సిరులు  వీరే  యొసఁగిరని  భావించువారికి పట్టదు వెర్రి.

పైనచెప్పిన  విధంగా సకల జీవులలోనున్న  ఆ పరమాత్మ, వైకుంఠేసుడగు  విష్ణువు  లక్ష్మితో చేరి,  వేవేల దేవతల  బలగంతో కూడి , సంపదలను ఇస్తూ వుంటారు అని తెలిసికోవాలి.
 పవర్స్ ఉన్న వారు  దేవతలు.  వారివారి,    నియోగించబడ్డ  అధికారములతో ,  నియోగించబడ్డ  పవర్స్ తో,
ప్రధాన దేవతలౌ  బ్రహ్మ, విష్ణు , రుద్రులకు సహకరించుచు వుంటారు..
వారే దేవతలు.  వారే  కాస్మిక్ పవర్స్ .
   
                         అన్నమయ్య మాట 

3, ఆగస్టు 2018, శుక్రవారం

కాస్మిక్ రహస్యం

  అంతరిక్షం  గూర్ఛి   శోధించడమంటే  ఆ  మానవాతీతశక్తిని గూర్చి  తెలిసికో వడమే...... ఒక స్థాయిలో కాస్మాలజీ  ఆధ్యాత్మికతకు మధ్య వ్యత్యాసముండదు. ఎందుకు?  ఏ బ్రహ్మాండాలను గూర్చి, ఏ ఆకాసాంతరాళాలను  గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నామో , వాటన్నిటిలోవున్నది ఆ “పరబ్రహ్మ” తత్వమే, ఆ మానవాతీతశక్తియే  గనుక, 
అన్నమయ్య  లోకాలను గూర్చి, లోకాలన్నీ ఎలాగ నిలిచి వున్నాయనే విషయం గూర్చి, ముక్తసరిగా , కొన్ని సంకీర్తనలలో చెప్పారు.   

14 శాశ్వతాలోకాలకు నాల్గు వైపులనున్న ఛానెల్స్ , అంటే దారులలోని తేజస్సును చూచి, ఆ దారులలో పయనించి, వెలుపలికి వచ్చాను, అని చెప్పాడు.  ( సంపుటం 4, సంకీర్తన). అన్నమయ్య  విష్ణువు  అంశతో
పుట్టానని  ఒక  సంకీర్తనలో చెప్పాడు.  

ఏఏ లోకములోనైనా, ఆ లోక  కేంద్రం “ పరబ్రహ్మ “ స్థానం. . . ఆ పరబ్రహ్మ చుట్టూ వున్న పరిథి ,   .    బ్రహ్మలు ,    
   రోమకూపములు, రుద్రులు ఉండే  స్థానం.
 
  . పాట 333, సంపుటం 3, లో, యీ ముఖ్యమైన  విషయాన్ని ఇలాగ చెప్పాడు.                                          

  “  ఒక్కడెవ్వడో ఉర్వికి  దైవము , ఎక్కువ  నాతని ఎరుగవో  మనసా “                                              

                           “ వొ ట్టిన జీవులకొక బ్రహ్మగలడు “     
                               నత్తనడుమ వారే నవబ్రహ్మలు
                                  జట్టుగా బ్రాహ్మలు సంతాయే జగము “. 
 
   పుట్టబోవు జీవురాసి నిలయం ఒక బ్రహ్మ.  లోకము నట్ట నడుమ  9మంది బ్రహ్మలు గలవు. .         అదీగాక , అనేక వ్యూహాత్మక స్థానములలో పెక్కు బ్రహ్మలు లోకమంతా గలవు. . లోకమంతా .        బ్రహ్మల  సంత లాగ వుంటుందట. .  బ్రహ్మలు  “ సజీవ శక్తి  కేంద్రాలు. “ సృష్టి కారక  కేంద్రాలు. “ఒక్కొక్క  బ్రహ్మ, ఒక్కొక్క   కార్యానికి  నియమించబదినది . .   “ముంచెడి  బ్రహ్మలు “ అని ఒక పాటలో చెప్పడం ఉంది.  అంటే,  కొన్ని  గ్రహములుగానీ…,  నక్షత్రములుగానీ,  వేరే ఖగోళ మండలములుగానీ    బలహీనమైనప్పుడు క్షీణించగా ,    యీ
“ముంచెడి  బ్రహ్మలో నిబిడీకృతంఔతాయి. ఇవి “ వొట్టిన బ్రహ్మలు . మరేమో, పుట్టబోయే జీవరాశి        నిలయం   ఇంకో బ్రహ్మ. ఈ నవబ్రహ్మలకు అధిష్టానకేంద్రం “ బ్రహ్మలోకం “.

                              కైలాసంబున కలడొక  రుద్రుడు.        
                               తాలిమి ఏకాదశ రుద్రులు మరి. 
                                 కాలరుద్రుడు కడపట  నదివో
                                   చాలిన  రుద్రుల  సంతాయే  జగము.    

రుద్ర స్థానములు 11.  రుద్రస్థానాలన్నింటిని కంట్రోల్ చేసే  స్థానం కైలాసం  .       
 రుద్రుల పేర్లు ఉదాహరణకు ,     కపిల, పింగళ, భీమా , విరూపాక్ష , విలోహిత, శాష్టా , శాసన,                  అజేష.మొదలైనవి. విభిన్నమిన  పేర్లతో పిలువబడతాయి . కడపటిది  కాల రుద్రుడు. ప్రతి             లోకమొక    రుద్రుల సంతే .  
   కానీ, “కైలాసము ” లో ఒక్క రుద్రుడు, ఏకాదశ రుద్రుల “అధిష్టానకేంద్ర , పేరు శివుడు.                
రుద్రుడు  “ అగ్ని కేంద్రము. “ అగ్ని భండారము. “.
   
   అవసరంలేని, కాస్మిక్ అస్తిత్వాలను కాల్చి వినాశము చేయు పని రుద్రులది. ఒక్కోక్కరుద్రునికి   వేరే  వేరే మోతాదులలో పని ఉంటుంది.

 “  అవతారంబున అలరినవిష్ణువు, ఆవల విష్ణుమా యమననియ్యుడి విష్ణువు”

       విష్ణు పదములో నున్న పరంజ్యోతి “ విష్ణు వు  “,  మొత్తం అన్ని లోకాలను  కాపాడుతుండును.  
ఈ నూరవ పడి లోనున్న  విష్ణువే  తన అంశం తో అన్ని పాలకులలో ఉండడమైంది . విష్ణువు సర్వ   లోక  రక్షకుడు. విష్ణు నామ కాంతిలోఅన్ని విధాలా  శక్తి రూపాలు వుంటాయి.         

    “”.  ఓజస్ తేజస్  ద్యుతి  ధర ,  సర్వ శక్తి ధర. ఉజ్వల ప్రజ్వల  రూపం , “ విష్ణు. “.

  లోకములోనగల అనేక రోమకూపములలోనున్న వెదజల్లబడే కాంతి, విష్ణు కాంతి.
 రోమ కూపములు   విష్ణుకాంతిని  కాస్మోస్లో  సమంగా  ప్రసరింపజేసే  “” హెడ్  లైట్”  లాంటివి.  

  లోకపాలకులు:   
                           1.   సజీవ  శక్తిధారణకేంద్రములు  ( బ్రహ్మలు )

                           2.   విష్ణుకాంతి కేంద్రములు  ( రోమకూపములు) 
                         
                             3.   అగ్ని కేంద్రములు  (. రుద్రులు). 
                   
                                 4.   సృష్టి  జనక  లోక కేంద్రం.  ( పరబ్రహ్మ).

లోకపాలనా   కేంద్రములకు  “ మనస్సు  “ కున్న గుణములు  ఉండుటవలన ,  వానిని  కేవలము  “ స్థానములు  “ గా  కాకుండా, సజీవ స్వరూపములుగా  భావించవలసి  ఉన్నది.   అందువలననే    మనము, బ్రహ్మను  “ బ్రహ్మము”.  ,  పరబ్రహ్మని   “పరబ్రహ్మము”. , రుద్రుని  “  రుద్రుడు””, అని    సంభోదించడమౌతున్నది.   

లోకపాలకులు  ప్రకృతితో  కూడి  ఏ  రూపమైనా   ధరించగలరు.  మన ఊహకందని  అద్భుతమైన  పవర్స్  అగు   లోకపాలకులు  తమ  తమ  కర్తృత్వము  నడుపుతూనే  వుంటారు.  
అది  “  కాస్మిక్ నియమము. “,  “  కాస్మిక్  రహస్యము”.   కూడా.   

అన్నమయ్య మాట



                         


   

25, జులై 2018, బుధవారం

ఆత్మలో విష్ణువు

   ఒకే ఒక్క సంకీర్తన చాలు. అంతా “ పరతత్వాన్ని “ పరిచేస్తోంది.  విప్పిచెప్తోంది.   ఇంక ఏమీ లేదు , “ఇంతే” , అంటోంది.  ఈ సంకీర్తన ఒక్కటి , ఆ ఒకే ఒక్కడైన  పరమాత్మ యగు హరి ని గూర్చి వివరించి చెప్పింది. 
                “ ఆతని మూలమే జగమంతా ,  ఆతుమ లోహరి కీలు”  యై వుండుగాని “
  అని , సంకీర్తనం  362,  సంపుటం 2  లో , అన్నమయ్య చెప్పారు.        
ఆత్మ  లోపల ముఖ్యమైన మాత్రిక విష్ణువు,” విష్ణువే “ నని  భావము.  

“ఆత్మ “  అంటే ఏంటి ?? ఆత్మ గుణగణాలేంటి??  అనే విషయం, అన్నమయ్య , 2వ సంపుటంలో ని,   419వ సంకీర్తనంలో  పండు ఒలిచినట్లు, చెప్పేసారు. ఆత్మ అంటే,  ఏ  నిర్వచనము , భగవద్గీతలో  స్పష్టంగా చెప్పబడినదో,  అదే అన్నమయ్య  తెలుగు పాటలో వివరించారు. 
  
“నైనం  ఛిన్దన్తి  శస్త్రాణి , నైనం  దహతి  పావకః , నచైనం  క్లేదయత్యాపో ,నశోషయతి  మారుతః “
  
      ఏది అయితే , ఆయుధాలతో  నరకబడదు, అగ్ని లో కాల్చబడదు , నీటిలో తడవదు , గాలిలో కొట్టుకబోదు , అదియే ” ఆత్మ “. ఈ గుణసము లున్నది, ఏ పదార్ధమూ గాలేదు. . 
 అది ఒక్క  “క్షేత్రం “ మాత్రమే కాగలదు. ఈ  క్షేత్రము  ఊహాతీతమైన  శక్తి ధారణ క్షేత్రం.  
ఎంత  లెక్కించలేని ప్రమాణాలలో  ఆకర్షణశక్తి ఉన్నదంటే,  “మనస్సు”కున్న గుణాలన్నీ  అందులో ఇమిడి అమరినదై  , “చిత్త ఆకర్షణ శక్తి క్షేత్రము ” గా  మారిపోయినది.                 
“ చిత్తము, దానితోబాటు చైతన్యము  గలిగిన  అపార  శక్తిద్ధారణ క్షేత్రమే  ఆత్మ “..    
అదృశ్యంగా,  విశ్వ అంతరాళా లలో  వ్యాపించియున్న  “చిత్త యుత  శక్తిద్ధారణ ఆకర్షణ క్షేత్రం” ఆత్మ.                “ ఆత్మలోని ఆ మనస్సే హరి,  అదే  విష్ణువు. “. 
విశ్వాత్మ , అనగా  విశ్వమంతా  వ్యాపించియున్న” విష్ణువే “. ఈ  గొప్ప రహస్యమును గూర్చి , యీ  క్రింది సంకీర్తనలో  అన్నమయ్య విసదీకరించారు . 

                     ఈతడు  నరకువడడు,  ఈతడగ్ని కాలడు 
                        ఈతడు నీట ముణగడు , ఈతడు గాలిబోడు 
                           చేతనుడై  సర్వగతుండౌ , చలియించడేమి టను 
                              ఈతల  ననాది , ఈతండిరవు  కదలడు 

చేరి కానరానివాడు , చింతించరానివాడు 
భారపు వికారాలను  బాసినవాడీ  “ఆత్మ ”
అరయ  వెంకటేశునాదీనామీతండని 
సారము తెలియుటే  సత్యం  జ్ఞానము    

“ఆత్మా , హరి ఒక్కటే”. ఆత్మలో హరి, హరిలో ఆత్మ, “ అన్న “ పరతత్వ రహస్యము “,  అంతరిక్ష విజ్ఞానశాస్త్ర రహస్యం కాక   మరేమిటి? 
అన్ని లోకాలు, సర్వమూ, “ ఆత్మలోనే  ఇమిడి ఉన్నవి. 
ఆత్మ కనిపించదు, ఊహకందనిరూపం, పదార్ధరహితమైన భారరహి తమైనది , శుద్ధ జ్ఞానం, కొన్ని కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాలనుండి  వ్యవస్థితమైనది.   ఆత్మలోని హరి  లక్షణములుగూడా   ఇవే .  
అందుకే  ఆత్మ , భూ మ్యాకర్షణ క్షేత్రంలోని  , పంచభూతాత్మక తత్వమగు  ప్రకృతితోగూడి,  ఏ  రూపమైనా  ధరించవచ్చుఁ.  విష్ణువును  మనము  ఏ  రూపంలోనైనా,  తలచి  పూజింపవచ్చు.  

ఆత్మ  క్షేత్రము.  హరి  క్షేత్రజ్ఞుడు.   



అన్నమయ్య మాట       



10, జులై 2018, మంగళవారం

వృధా

   అన్నమయ్య   ఎలాగంటున్నాడో చూడండి !   ఈ  భూమిపై ,  అన్నీ  వృధా, వ్యర్థం. ఈ క్రింది  పాటలో, ఏది. ఈ ప్రపంచంలో   ఉపయోగపడే విషయం ?  ఏది ఉపయోగ పడదో  వివరించారు.     

           “ వెఱపులు  వొరపులు  వృధా  వృధా , ధరపై  మరి అంతయును వృధా “ (1, సంకీర్తన 217)

  అన్ని బంధాలూ  వృధానే. ఎందుకంటే,  పోయేటప్పుడు అవన్నీ విడచి పోవాలిగా!!!
ఎవ్వరూ  నీతో  వెంట రారు గదా!!! మరి, ఈ బంధుత్వాలకోసం  ఎన్నో  చెడ్డ  పనులు చేసి,  ఎంతో పాపాన్ని 
కూడకట్టుకొని,  నాది నాది అంటూ ఎన్నో  కస్టాలు భరించితే,  చిట్టా చివరికి  నీతో  ఎవ్వరైనా వస్తున్నారా? ??
ఒక్కడివే వస్తావు.  ఒంటరిగా పోతావు.  అందుకని , ప్రాపంచికత  వ్యర్థం, అంటారు అన్నమయ్య. 
                         
             “  తడయక  చేసిన  దానంబులు వృధా,  ఎడయక  ఎరిగిన  ఎరుక వృధా 
                 ఒడలిలోని  హరినొనరగ  మతిలో ,  తడవని జీవమే  తనకు  వృధా “
మనలోనున్న  దైవాన్ని , మనస్సులో తలచుకోని  జీవితం, ఎన్ని దానాలు చేసినా  వ్యర్ధమే. 

                “ జగమున బడసిన  సంతానము వృధా, తగిలి గడించిన  ధనము  వృధా 
                    జగదేక విభుని  సకలాత్ముని  హరి , తెగి కొలువని  బుద్ధియును  వృధా “
అన్నిజీవులలోనున్న   సర్వాంతర్యామియైన  హరిని  మెచ్చి పూజించక,  పడీపడీ సంపాదించిన  సంపదలు, 
సంతానమూ  వ్యర్ధమే.   

                      “ పనివడి  కూడిన  పరిణామము వృధా , వొనరగ వుండిన  ఉనికి  వృధా 
                            ఘనుడగు  తిరువేంకటగిరి  హరిగని ,  మననేరని  జన్మములు  వృధా “
శ్రీ వెంకటా ద్రి  మీద  నెలకొన్న  గొప్పవాడైన వేంకటేశ్వరుని  హరిని,  ఆ వేంకటేశ్వరుని మనసార  పూజించక, 
చేసిన అనేకమైన  పనులు , వాటి  ఫలములు , ఉండే  వునికే  వ్యర్ధము,  అన్నారు అన్నమయ్య. 

సారాంశమేమిటంటే , అంటే,  ఈ  జన్మమెత్తినందుకు , సాఫల్యము  శ్రీ హరి స్మరణమే. 
మిగిలిన  పనులేవైనా చేయక తప్పదు గనుకే చేయాలి.  అవీ  ధర్మబద్ధమైన  పనులే చేయాలి. 
సంపదలూ,  సంతానములూ,  సంబంధాలూ ,  బాంధవ్యాలూ, పదవులూ, పేర్లూ ...... అన్నీయూ , 
శ్రీ వేంకటేశ్వరుని పూజించినపుడే,  సార్ధకమౌతాయి గానీ, లేకుంటే , వృధా అయి  ఫలించవు. 
దైవాన్ని మరువకుండా  , మంచి బుద్ధితో   జీవితాన్ని  గడపమని  అన్నమయ్య వేదాంతం. 

                     అన్నమయ్య మాట 






9, జులై 2018, సోమవారం

మాయ

మన దేశంలో,  “ మాయ “ అనే  పదం  చాలా సాధారణంగా  వినిపిస్తూవుంటుంది. మనకు తెలియకుండానే , మనల్ని  ప్రభావితం  చేయడమనే  భావంతో  వాడబడుతోంది . కానీ అలాగెందుకు  అవుతోంది ? ఈ  మాయ  ఎల్లాగ వుంటుంది ? మాయనుండి తప్పించుకోవడం  ఎలాగ ?...? అన్నమయ్య  మనకు  చక్కగా,  తక్కువ పదాలతో, తన  సంకీర్తనల  ద్వారా  చెప్పార

    “ తెలియరాదు  నీ మాయ ,  “ తెర మరుగు “,  పెక్కు  “వలల “ చిక్కక  నిన్నే కొలువగవలయ”

“చూడగ ఈ జగత్తుకు సూత్రధారివి నీవు,  జోడైన  ఈ సుత్రాన  ఆడుచును  సర్వంబున్నది.                     యే డచూచినా  నీవుందు  నెవ్వరికి  కానరావు, “   


తెర మరుగు “ అంటే ఒక  తెరలోపల  దాగివుందని అర్ధం.  మాయ అనేది ఒక  “ వల “ లాగా , ప్రపంచాన్ని   , అందులోన.    మనల్ని , కప్పి వుంది.  ప్రపంచమంతా  వ్యాపించియున్న  ఆ “పరంజ్యోతిని “ కూడా కప్పివుంది.  కనుకే,  దైవము కానరాడు .  “మాయ “ అనే తెర తొలిగితేనే ,  సర్వమూ  కనిపిస్తుంది..

             “పొలసి  “ మసకమందు “ పోడమేటి  జీవుని “.  ( 4, సంకీర్తన 363).   

బిడ్డ  తల్లి గర్భమందు , యీ  మాయ అనిపిలువబడే  సంచీ లోనే  ఉంటాడు. అది తొలగినాకే  పుడతాడు..
పుట్టుక ముందూ , పుట్టిన పిదప కూడా , జీవి “మాయాజాలం “ లోన , చిక్కుకొని వుంటాడన్నమాట.

మాయ అంటే?  మాయ లక్షణాలు??  మాయ అనే వలనుండి బయటపడడం??....

సత్వ, రజస్తమో గుణాల సమ్మేళనం మాయ.  పంచ భూత వికారాలతో , నల్లని రంగుతో, ప్రకృతి నుండి పుట్టినది మాయ. పంచ భూతాలగు  “భూమి, ఆకాశము,  జలము,  వాయువు, అగ్ని “ , ప్రతి ఒక్కటి,  ఒక శక్తి ని కలిగివున్నవి. “ భూమ్యాకర్షణ శక్తి ,  కాస్మిక్ శక్తి,  జలప్రవాహ  శక్తి ,  వాయు శక్తి, ఉష్ణశక్తి “, అనే  పంచభూతాత్మక శక్తులు మాయలో ఉంటాయి.  ఏ శక్తీ  ఎలాగ   కనిపించదో,  అలాగే  “మాయా శక్తి  “యూ          కనిపించదు. మరి , మాయ త్రిగుణాల సంగమం  గదా,  అంటే,  అన్ని గుణాలు  ఎదో ఒక రకమైన  “శక్తి  తరంగరూపాలే. “ అని అర్ధం.
ఆంతేకాదు , మాయ  మనస్సును ప్రభావితం చేయడం వల్ల, “కామ క్రోధ మోహ మదమాత్సర్యాలు “,  ప్రేమ మమతా  దయ కరుణ  అనే,  పంచ భూతవికారాలను  ప్రకోపిస్తుంది.
మనోవికారాలు ఉత్పన్నమఔతాయి.  ప్రతి . “మనో భావం” ఒక  “ శక్తితరంగమే”  ఖఛ్చితంగా, ఖఛ్చితంగా.
అదృశ్యంగా “  పరంజ్యోతి”ని  కప్పిపెట్టివుంచే  నల్లని తెర  అయిన  ,  ఈ “మాయ “ ప్రపంచ మంతా  వ్యాపించి యున్నది.  ఈ మాయామోహం నుండి  బయటపడే మార్గం , క్రింది  సంకీర్తనలో  చెప్పారు
అన్నమయ్య.  

                   

“దండితోడ  నీ మాయ  దాటేయందుకు ఉపాయము , నిండు  నిదానంగా  నీపై భక్తి “
           “ఇంతకంటే  మరిలేదు , ఎవ్వరినీ ఉపాయము “.         ( 2, సంకీర్తనం 334)

“మాయ “అనే  తెర తొలగడానికి ,  పరంజ్యోతి  దర్శనానికి  మార్గం,  “భక్తి “  ఒక్కటే,  అని ఒక్కాణించి చెప్తారు  అన్నమయ్య ,    “ భక్తి భావం “ గూడా , ఒక  “శక్తి “ యే,  “మాయా శక్తి”  కంటే  పవర్ఫుల్., బలీయమైనది.

భక్తి శక్తి ఒక్కటే,  మాయాశక్తి   పొరని  తెరిచేసి ,  ఆ  అద్భుతమైన,   కోటిసూర్యకోటి  తేజోమయమైన , సర్వవ్యాపియైన,  విశ్వకాంతిని చూపించగలదు .



                      అన్నమయ్య మాట

   

21, జూన్ 2018, గురువారం

కాస్మిక్అంకెలు

      అన్నమయ్య తన  సంకీర్తనల్లో  , ఎంతో ఆధ్యాత్మిక, సాంఘిక, పౌరాణిక, సందేశాత్మక, వైజ్ఞానిక, ప్రభోదాత్మక, ఆచార వ్యవహారాత్మక, భజనాత్మక విషయాలు,  మనకు తెలియజేసారు.
కానీ,  సంఖ్యాత్మకంగా కూడా, కొన్ని  విషయాలు చెప్పియున్నారు. అవి ఈ సంకీర్తనలలో వున్నాయి.

ఒకటి ;        “  ఇతడొక్కడే సర్వేశ్వరుడు “ అంటే , అన్ని లోకాలను కాపాడేది ఒక్కడే.
                       “ విష్ణు డొక్కడే విశ్వాత్మకుడు“ .  విష్ణువు నెంబర్ ఒక్కటి.   (2వ సంపుటం, 314 సంకీర్తనం  )
                         “ ఉపమించి  చూసితె  ఒక్కటే జగము ..   ( సంపుటం2, సంకీర్తనం 314)
                           “ఒక్కటే  అంతర్యామి , ఉపకారి చేపట్టు “ (1వ సంపుటం , 500 సంకీర్తనం )
                     
రెండు :       “ రెండు మూలికలు , రేయి పగలు నున్నవి “.    ( 1వ సంపుటం, 452 సంకీర్తన )
                       రాత్రి, పగలు “ అనే వి 2 చాలా ముఖ్యమైన  సృష్టి విషయాలు.

మూడు :       ముల్లోకములు , అంటే,  స్వర్గలోకము, భూలోకము, పాతాళలోకము.

నాలుగు:        నాల్గు దిక్కులను

ఐదు :            ఇల “  పంచభూతములలో ” గుణములు .

ఆరు:           అరయ  ఆరుకోణముల నమరిన “చక్రమా” .  ( 3. 282సంకీర్తనం )

ఏడు            

ఎనిమిది:          “మించి  నిండుకొంటే  8 ఏ దిక్కులు “. ( 2, సంకీర్తనం 314 )

తొమ్మిది:             అల   “నవగ్రహవిహారంబు “ ( 2, సంకీర్తనం 345 ).


                         “  నట్టనడుమ వారే  నవబ్రహ్మలు “ ( 3, సంకీర్తనం 333)
పది:

పదకొండు:                   “తాలిమి  ఏకాదశరుద్రులు”           ( సంపుటం 3, 333 వ సంకీర్తనం ).

పన్నెండు:                “పండ్రెండు రాసులు “
                               “నీవొక్కడివే  సర్వాధారము,  నీయందే  ద్వాదశాదిత్యులు “ ( 3,  సంకీర్తన 239 )

 పదునాల్గు:           “యెనసి పదునాలుగే ఎడమైన లోకములు “     ( సంపుటం 2, 314 సంకీర్తన )

                           అంటే శాశ్వత లోకాలు  14మాత్రమే , మిగిలినవి అల్ప కాల లోకాలు.

పదహారు:              అట్టే  “పదారు భుజాల నమరిన చక్రమా “  ( 3, సంకీర్తన 282 )


                   “ ఎవ్వని నాభి పుట్టె  లోకములు , ఎవ్వని  కుక్షి  నీ జగములు వున్నవి “
                  “ అంకెల  శ్రీ వెంకటేశు నండనుండరో “.     ( 3, సంకీర్తనం 241 )

నూరు:          “ పది పది హరి నీ  పదమే నిజము “ (సంకీర్తనం 312, సంపుటం ).
                         అంటే,  ( 10 సార్లు 10 ) 100 వ అంచె లో విష్ణులోకము.

వెయ్యి:             “ ధారలు వేయి తోటి తగు చక్రమా “( 282 సంకీర్తనం,  3వ సంపుటం )
                            విష్ణు చక్రం, వెయ్యి ధారలతో , తేజోమయమైన అగ్ని శిఖలను, ఆకాశమంతా వెదజల్లుతూ
                              బ్రహ్మాన్డములను ప్రకాశవంతం చేయుచున్నది.

కోట్లు :               “ కుందని నీ రోమకూపములలో   గొందూల  బ్రహ్మాణ్డకొట్లట          

                         
“అంకెల వెంకటేశు “, అనే ఒక విశేష ప్రయోగం చేశారు అన్నమయ్య.  ఇందులో గూఢార్థముంది .
వెంకటేశు,  వైకుంఠ విష్ణు , సృష్టిల,  ప్రతి అస్తిత్వానికి ఒక “అంకె “  నియామకమై ఉంటుంది. .
ప్రతి  పదార్దానికి,  అది సామూహికమైనా, ఓక్కటే అయినా , ప్రతి కాస్మిక్ అస్తిత్వానికి ఒక నెంబర్      జోడించబడి ఉంటుంది. ఆలెక్కన, ప్రతి జీవికి ఒక నెంబర్ ఉండాలిగదా ?......

                అన్నమయ్య మాట.